ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసించాలి

ABN , First Publish Date - 2022-05-16T05:15:15+05:30 IST

ప్రభుత్వం అనుస రిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని ఎమ్మెల్యే ఏ లూరి సాంబశివరావు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసించాలి
ఏలూరి ముందు సమస్యలు వివరిస్తున్న నాయకులు, కార్యకర్తలు

ఎమ్మెల్యే  సాంబశివరావు

పర్చూరు, మే 15:  ప్రభుత్వం అనుస రిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని ఎమ్మెల్యే ఏ లూరి సాంబశివరావు పిలుపునిచ్చారు.  ఆదివారం ఇసుకదర్శి క్యాంపు కార్యాల యంలో జరిగిన కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడారు. అన్నివర్గాల ప్ర జలను పీడిస్తున్న ప్రభుత్వంపై పోరు సాగించాలాలన్నారు.  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను ఛైతన్యం చేయాలన్నారు. పేద ప్రజల నడ్డి విరుస్తూ కరెంటు చార్జీలను  అ మాంతంగా పెంచారని ఆయన ధ్వజమెత్తారు.  వచ్చే ఎన్నికల్లో తెలు గుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఏలూరి పిలుపునిచ్చారు.  అన్నివర్గాల సంక్షేమంకోసం పని చేసిన నారా చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రిగా చేయ టానికి ఐక్యంగా కృషి చేయాలన్నారు. దీనికి యువత కీలక భూమిక పోషించాలని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని అధిక మించేందుకు ప్రభుత్వం తీ సుకున్న చర్యలు శూన్యమ న్నారు. ఈ సందర్భంగా ప లుగ్రామాల్లోని సమస్యలను నాయకులు ఏలూరి ముందు ఏకరువు పెట్టారు.  


టీడీపీ నేతను పరామర్శించిన ఏలూరి 

మార్టూరు, మే 15: ఇటీ వల అనారోగ్యానికి గురైన టీడీపీ నాయకుడు మంద పాటి అంజయ్యను ఆదివారం మార్టూరులోని రామ్‌నగర్‌లో ఆయన ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరామర్శించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు పార్టీ అండగా ఉంటుందని ఏలూరి భరోసా ఇచ్చారు. 

కార్యక్రమంలో కామేపల్లి హరిబాబు, పోపూరి  శ్రీనివాసరావు, కామినేని జనార్దన్‌, షేక్‌ ఫరూక్‌, గుర్రం శ్రీను, పెడవల్లి రామారావు, శివరాత్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T05:15:15+05:30 IST