బీజేపీ కార్యకర్తలపై దాడులను ఖండిస్తూ నిరసన
ABN , First Publish Date - 2021-05-07T06:22:45+05:30 IST
పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులను ఖండిస్తూ జనగామంలో గురువారం ఆ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేశం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు.
కళ్యాణ్నగర్, మే 6: పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులను ఖండిస్తూ జనగామంలో గురువారం ఆ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేశం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగాల్లో బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక తృణముల్ కాంగ్రెస్ బీజేపీ కార్యాలయాలను, బీజేపీ కార్యకర్తలపై దాడులు నిర్వహిస్తున్నారని, ఈ దాడులను అరికట్టడానికి బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాం డ్ చేశారు. ఇప్పటికైనా అక్కడ దాడులను ఆపకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ నాయకులు కాసిపేట శివాజీ, జక్కుల నరహరి, గుండబోయిన సదానందం, మచ్చ విశ్వాస్, రాజేష్, రమేష్, సనత్కుమార్, కత్తెరశాల, సాయిలు, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు.