ఉక్కు ఉద్యోగులకు మద్దతుగా జలదీక్ష
ABN , First Publish Date - 2022-06-28T05:09:38+05:30 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని బీసీ చైతన్య సమితి జిల్లా అధ్యక్షుడు పొట్నూరి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
పెంటపాడు, జూన్ 27: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని బీసీ చైతన్య సమితి జిల్లా అధ్యక్షుడు పొట్నూరి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. స్టీల్ప్లాంట్ ఉద్యోగులు చేపట్టిన దీక్ష 500 రోజులు పూర్తయిన సందర్భంగా వారికి మద్దతుగా పడమర విప్పర్రు వద్ద జలదీక్ష చేస్తూ సంఘీభావం ప్రకటించారు.