ఎమర్జన్సీ వ్యతిరేక దినం సందర్భంగా నిరసన

ABN , First Publish Date - 2022-06-26T04:41:14+05:30 IST

ఎమర్జన్సీ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం రాజం పేటలో గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి పోతుగుంట రమేష్‌ నాయుడు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

ఎమర్జన్సీ వ్యతిరేక దినం సందర్భంగా నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు

రాజంపేట, జూన్‌ 25 : ఎమర్జన్సీ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం రాజం పేటలో గాంధీ విగ్రహం ఎదుట  బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి పోతుగుంట రమేష్‌ నాయుడు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 1970లో ఇందిరాగాంధీ,  ఎమర్జన్సీని విధించగా, దేశవ్యాప్తం గా నిరసన వ్యక్తమైందన్నారు. ఆ పరిసితులను ఎవరూ మర్చిపోలేదని, అందువల్లే ప్రతి ఏడాది జూన్‌ 25 తేదీన ప్రతి ఏడాది ఎమర్జన్సీ వ్యతిరేక దినం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆదినారాయణ, నాగరాజు, రాము, సూర్యచంద్ర, వేణు గోపాల్‌, నాగేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-26T04:41:14+05:30 IST