బస్సులు ధ్వంసం, రోడ్లు దిగ్బంధం.. ఎమ్మెల్యే మృతిపై బీజేపీ నేతల నిరసన
ABN , First Publish Date - 2020-07-14T16:13:35+05:30 IST
పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బస్సులు ధ్వంసం చేస్తూ, రోడ్లు దిగ్బంధం చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మృతి చెందడం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బస్సులు ధ్వంసం చేస్తూ, రోడ్లు దిగ్బంధం చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మృతి చెందడాన్ని నిరసిస్తూ ఉత్తర పశ్చిమ బెంగాల్లో 12 గంటల పాటు బంధ్కు పిలుపునిచ్చారు. దీంతో స్థానికంగా ఉండే మార్కెట్లను మూసేశారు.
రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఎమ్మెల్యే మృతిపై బీజేపీ కార్యకర్తలు బంధ్కు పిలుపునిచ్చారు. అనంతరం మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కూచ్బెహార్ ప్రాంతంలో నిరసనకారులు బస్సులను ధ్వంసం చేస్తున్న సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పలువురిపై కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.