Protocol‌ రగడ

ABN , First Publish Date - 2022-05-25T16:35:34+05:30 IST

ముషీరాబాద్‌ డివిజన్‌ పటాన్‌ బస్తీలో మంగళవారం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సందర్భంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు పరస్పర దాడులకు

Protocol‌ రగడ

తోపులాట.. పరస్పర దూషణలుఫ సమాచారం లేదన్న కార్పొరేటర్‌

పనులు ప్రారంభించకుండానే వెనుదిరిగిన ఎమ్మెల్యే 


హైదరాబాద్/ముషీరాబాద్‌: ముషీరాబాద్‌ డివిజన్‌ పటాన్‌ బస్తీలో మంగళవారం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సందర్భంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు పరస్పర దాడులకు యత్నించారు. తోపులాట, దూషణలతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో అభివృద్ధి పనులను ప్రారంభించకుండానే ఎమ్మెల్యే వెళ్లిపోయారు. పటాన్‌బస్తీలో డ్రైనేజీ పైప్‌లైన్‌  పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే ముఠాగోపాల్‌, జలమండలి డీజీఎం వాహెబ్‌ టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి వచ్చారు.


పనులను ప్రారంభించే క్రమంలో స్థానిక కార్పొరేటర్‌ భర్త, ముషీరాబాద్‌ నియోజకవర్గం బీజేపీ జాయింట్‌ కన్వీనర్‌ ఎం.నవీన్‌గౌడ్‌ డివిజన్‌ నాయకులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో ఆయన మాట్లాడారు. డివిజన్‌ కార్పొరేటర్‌కు సమాచారం ఇవ్వకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ప్రొటోకాల్‌ పాటించరా.. ఇంత వివక్ష ఎందుకని ప్రశ్నించారు. సంబంధిత శాఖ అధికారులు మీకు సమాచారమిచ్చారని అనుకున్నామని ఎమ్మెల్యే గోపాల్‌ బీజేపీ నాయకులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అదే క్రమంలో అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు డి.శివముదిరాజ్‌ తదితర టీ ఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీ నాయకులు నవీన్‌గౌడ్‌ తదితరులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పరుష పదజాలంతో దూషించుకుంటూ పరస్పర దాడులకు యత్నించారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. ఇరు పార్టీల నేతలకు ఎమ్మెల్యే సర్దిచెప్పి పనులను ప్రారంభించకుండానే ఎమ్మెల్యే  వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్‌ విలేకరుల సమావేశఽంలో మాట్లాడుతూ అభివృద్ది పనులను అడ్డుకోవడం సరికాదన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు అడ్డుతగులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ ఎస్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబుయాదవ్‌, డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నర్సింగ్‌ప్రసాద్‌, ఆకులఅరుణ్‌కుమార్‌, వర్కింగ్‌ప్రెసిడెంట్‌  శ్రీధర్‌రెడ్డి,నాయ కులు శ్రీధర్‌చారి, రాజు, అజయ్‌ముదిరాజ్‌, లక్ష్మణ్‌ గౌడ్‌ పాల్గొన్నారు.


 అడ్డుకుంటే  ఊరుకోం : టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు

ముషీరాబాద్‌లో చేపట్టే అభివృద్ది పనులను బీజేపీ నేతలు అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు హెచ్చరించారు. ముషీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు డి.శివముదిరాజ్‌, డివిజన్‌ అధ్యక్షుడు నర్సింగ్‌ప్రసాద్‌, మాజీ అధ్యక్షుడు సయ్యధ్‌ అహ్మద్‌ భకి ్తయార్‌ మాట్లాడారు. బీజేపీ నాయకులు తమ రాజకీయ లబ్ధికోసం ఎమ్మెల్యే గోపాల్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.


ప్రొటోకాల్‌ పాటించడం లేదు: కార్పొరేటర్‌ సుప్రియ

ముషీరాబాద్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో అఽధికారులు, ఎమ్మెల్యే ప్రొటోకాల్‌  పాటించడం లేదని స్థానిక కార్పొరేటర్‌ సుప్రియానవీన్‌గౌడ్‌ ఆరోపించారు. తాము నిధులు మంజూరు చేయిస్తే టీఆర్‌ఎస్‌ నాయకులు గొప్పలు చెబుతూ నిఽధులు వారే మంజూరు చేయించారని ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ముషీరాబాద్‌ నియోజకవర్గం బీజేపీ జాయింట్‌ కన్వీనర్‌ ఎం.నవీన్‌గౌడ్‌, డివిజన్‌ బీజేపీ అధ్యక్ష, కార్యదర్శులు బద్రినారాయణ, కంచికుమార్‌, బీజేవైఎం నగర కార్యదర్శి అనిల్‌కుమార్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T16:35:34+05:30 IST