ఘనంగా కార్గిల్ విజయ్ దివస్
ABN , First Publish Date - 2021-07-27T05:25:16+05:30 IST
గాజులరేగ మాజీ సైనికుల ఇళ్ల స్థలాల ఆవరణలో సోమవారం కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
విజయనగరం (ఆంధ్రజ్యోతి) : గాజులరేగ మాజీ సైనికుల ఇళ్ల స్థలాల ఆవరణలో సోమవారం కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా మాజీ సైనిక్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం వివిధ యుద్ధాల్లో వీరమరణం పొందిన జిల్లాకు చెందిన సైనిక కుటుంబాల సభ్యులకు, వీర మాతలను సత్కరిం చారు. సైనికుల సేవలను వెలకట్టలేమని, దేశం కోసం ప్రాణాత్యాగం చేసిన వారిని నిత్యం స్మరించుకోవాలని సంఘం అధ్యక్షుడు దేవర ఈశ్వరరావు తెలిపారు. భారత సైనికుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. జిల్లా మాజీ సైనిక్ సంక్షేమ సంఘం కార్యదర్శి బి.వెంకటరావు, ఏవీఆర్ నాయుడు, ఎ.సత్యనారాయణ, ఉమామహేశ్వరావు, రాజ్కుమార్, గోపాల్రావు పాల్గొన్నారు.