మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN , First Publish Date - 2022-07-01T06:32:11+05:30 IST

మెరుగైన వైద్యసేవలు అందించాలి

మెరుగైన వైద్యసేవలు అందించాలి


మొయినాబాద్‌, జూన్‌ 30: ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారి స్వరాజ్యలక్ష్మి వైద్యసిబ్బందికి సూచించారు. వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీ్‌షరావు ఆదేశాలమేరకు  బుధవారం రాత్రి మొయినాబాద్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో తమ సిబ్బందితో కలిసి దవాఖాన నిద్ర చేశారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బందితో సవీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యకేంద్రంలో వసతులు, సమ్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేయకూడదనిచెప్పారు. సమయపాలన పాటించాలన్నారు. రాత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఇద్దరు గర్భిణులను ఆమె పరీక్షించారు. దవాఖాన నిద్రలో జిల్లా వైద్యాధికారితో పాటు చేవెళ్ల డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌వో దామోదర్‌, వైద్యాధికారులు శ్రీనివాస్‌, వాణి, జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి స్వర్ణకుమార్‌, డీఐవో డాక్టర్‌ సృజన, డాక్టర్‌ రాజేష్‌, డీఎంవో శ్రీనివాస్‌, అధికారులు సుదర్శన్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-07-01T06:32:11+05:30 IST