సచివాలయ ఉద్యోగుల వివరాలను 25లోగా అందజేయండి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-20T06:14:00+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వివరాలను ఈనెల 25వ తేదీలోగా అందజేయాలని అధికారులను కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదేశించారు.

సచివాలయ ఉద్యోగుల వివరాలను 25లోగా అందజేయండి: కలెక్టర్‌
సమావేశంలో ప్రసంగిస్తున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి

తిరుపతి(రవాణా), మే 19: ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వివరాలను ఈనెల 25వ తేదీలోగా అందజేయాలని అధికారులను కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదేశించారు. గురువారం డీఆర్వో శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి రూపేంద్రనాథ్‌రెడ్డి, నగర ఉప కమిషనర్‌ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి దొరసాని, తదితర అధికారులతో సమీక్షించారు. ఈనెలాఖరుకు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాల్సి ఉందన్నారు. చిత్తూరు, నెల్లూరు  జిల్లాల అధికారుల సహకారంతో త్వరగా సమాచారం సేకరించాలని చెప్పారు. పోలీస్‌ వెరిఫికేషన్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Updated Date - 2022-05-20T06:14:00+05:30 IST