ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించండి
ABN , First Publish Date - 2021-03-07T05:11:28+05:30 IST
ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారుల కు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలని, ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించేది లేదని ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ అన్నారు.
ఐటీడీఏ పీవో కూర్మనాథ్
పార్వతీపురం, మార్చి 6: ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారుల కు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలని, ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించేది లేదని ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ అన్నారు. ఆయన శనివారం తన చాంబర్లో సబ్ప్లాన్ మండలాల పరిధిలోని ఐసీడీఎస్ సీడీపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పంపిణీపై అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ప్లాన్ మండలాల్లోని పిల్లల్లో పోషకాహార లోపం ఉండకూడదన్నారు. లోప పోషణకుగల కారణాలపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించి సీడీపీవోలు కారణాలు వివరించారు. సమావేశంలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, భద్రగిరి, పాచిపెంట మండలాల సీడీపీవోలు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్: మండలంలో గిరిజన ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో నిర్మితమైన నూతన బీటీ రహదారులను శనివారం ఐటీడీఏ పీవో కూర్మనాథ్ పరిశీలించారు. మండలంలో లచ్చిందొరవలస నుంచి తోకుడువలస, తదితర రహదారులను పరిశీలించారు. కార్యక్రమంలో ఈఈ శాంతేశ్వరరావు, తదితర ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.