గన్నీబ్యాగులు అందించి ధాన్యం కొనుగోలు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-05-07T04:26:15+05:30 IST

మక్తల్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రతీ రైతుకు గన్నీబ్యాగులు అందించి ధాన్యం కొనుగులు చేస్తామ ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్‌రెడ్డి అన్నారు.

గన్నీబ్యాగులు అందించి ధాన్యం కొనుగోలు: ఎమ్మెల్యే
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిట్టెం

  మక్తల్‌, మే 6 : మక్తల్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రతీ రైతుకు గన్నీబ్యాగులు అందించి ధాన్యం కొనుగులు చేస్తామ ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్‌రెడ్డి అన్నారు. గురు వారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ  జిల్లాకేంద్రంలో 20లక్షల గన్నీబ్యాగులు ఉన్నాయని రవాణా సౌకర్యం సరిగా లేక పోవడం వల్లనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రైతులు అధైర్యపడకుండా ఉండాలన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ మండలాలకు చెందిన 35మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రిసహాయనిధి నుంచి మంజూరు అయిన ఎల్‌వోసీలను  ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అందించారు. కార్యక్రమంలో మాగనూరు జడ్పీటీసీ వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-07T04:26:15+05:30 IST