భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు అందించాలి
ABN , First Publish Date - 2020-07-06T10:24:49+05:30 IST
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు అందించడమే సమాజం ముందున్న గొప్ప లక్ష్యమని శ్రీకాకుళం ..
రామలక్ష్మణ జంక్షన్: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు అందించడమే సమాజం ముందున్న గొప్ప లక్ష్యమని శ్రీకాకుళం నగర పాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. మొక్కలు విరివిగా నాటడం వల్ల ప్రాణవాయువు వస్తోందని పేర్కొన్నారు. ఆదివారం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో అటవీశాఖ, స్టార్ వాకర్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పౌరసంబంఽ దాల అధికారి రమేష్, ఎఫ్సీఐ మేనేజర్ రమణ, పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు నారాయణరావు, అటవీ రేంజ్ అధికారి గోపాలనాయుడు, సెక్షన్ అధికారులు రమణమూర్తి, హరిబాబు, స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.