జీడికి మద్దతు ధర కల్పించండి

ABN , First Publish Date - 2021-05-07T05:09:07+05:30 IST

జీడిపిక్కల బస్తా (80 కిలోలు)కు రూ.16వేల మద్ధతు ధర ప్రకటించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం వద్ద గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీడి పిక్కలను రైతు భరోసా కేంద్రాల ద్వారా తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫార్స్‌లు అమలు చేయా

జీడికి మద్దతు ధర కల్పించండి
మాట్లాడుతున్న రైతు కూలీ సంఘ నాయకులు





పలాస రూరల్‌ : జీడిపిక్కల బస్తా (80 కిలోలు)కు రూ.16వేల మద్ధతు ధర ప్రకటించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం వద్ద గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీడి పిక్కలను రైతు భరోసా కేంద్రాల ద్వారా తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫార్స్‌లు అమలు చేయాలని, గత ఏడాది  కలెక్టర్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రతి జీడి పిక్కల బస్తాకు ఇన్సింటీవ్‌గా ప్రకటించిన రూ.1000 తక్షణమే అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా నాయకులు బాలకృష్ణ, పాపయ్య, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2021-05-07T05:09:07+05:30 IST