బాధితులకు భోజనం అందజేత
ABN , First Publish Date - 2021-07-24T04:37:50+05:30 IST
జిల్లాలోని ముంపు ప్రాం తాల్లో టీఆర్ఎస్ యువజన నాయకులు అలోల్ల గౌతం రెడ్డి, దివ్యారెడ్డి పర్యటించారు.
నిర్మల్ టౌన్, జూలై 23 : జిల్లాలోని ముంపు ప్రాం తాల్లో టీఆర్ఎస్ యువజన నాయకులు అలోల్ల గౌతం రెడ్డి, దివ్యారెడ్డి పర్యటించారు. పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ, సారంగాపూర్ మండలంలోని దుర్గానగర్ తం డా, నాగనాథ్ తండాల్లో ముంపు బాధితులకు ఆహార ప్యాకెట్లు, నిత్యావసర సామగ్రి అందజేశారు. వారి స మస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ... విపత్తుల సమయంలో తోటివారికి సహాయం చేయడం సంతోషంగా ఉంద న్నారు. ఇది ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు.