పెసరవాయిలో బందోబస్తు
ABN , First Publish Date - 2021-06-20T05:43:52+05:30 IST
పెసరవాయి గ్రామంలో జంట హత్య కేసుల్లోని నిందితుల కోసం పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
గడివేముల, జూన్ 19: పెసరవాయి గ్రామంలో జంట హత్య కేసుల్లోని నిందితుల కోసం పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల కాల్ రిజిస్టర్ ఆధారంగా విచారణ చేపట్టారు. అనుమానం ఉన్న వారిని విచారిస్తున్నారు. హత్య చేసిన తరువాత నిందితులు వెళ్లిన మార్గాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. చెక్పోస్టులలో తనిఖీలు చేశారు. ఇప్పటికే ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పెసరవాయిలో 20 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.