ఆమదాలవలసలో రెచ్చిపోయిన చైన్స్నాచర్లు
ABN , First Publish Date - 2020-11-28T05:08:47+05:30 IST
పట్టణంలో చైన్స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకే రోజు ఇద్దరి మహిళల మెడలోని బంగారు గొలుసులను తెంపుకెళ్లిపోయారు.
ఇద్దరి మహిళల బంగారు గొలుసులను తెంపుకెళ్లిన వైనం
ఆమదాలవలస: పట్టణంలో చైన్స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకే రోజు ఇద్దరి మహిళల మెడలోని బంగారు గొలుసులను తెంపుకెళ్లిపోయారు. పట్టణానికి చెందిన సూరపురెడ్డి కళ్యాణి అనే మహిళ తన బంధువుల ఇంటిలోని పుట్టిన రోజు వేడుకకు నడుచుకొని వెళ్తుండగా పాలపోలమ్మ గుడి సమీపంలో బైక్పై వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడలోని నా లుగు తులాల పుస్తెల తాడును తెంపుకొని పరారయ్యాడు. దీంతో ఆమె లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఇది జరిగిన కొద్దిసేపటికే రామలింగేశ్వర పుష్కరిణి సమీపంలో పాతినవారి వీధికి చెందిన కిల్లి నారాయణమ్మ మెడలో ఉన్న తులంన్నర పుస్తెల తాడును తెంపుకెళ్లిపోయారు. ఈమె తన బంధువుల ఇంటిలో జరిగిన శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ రెండు దొంగతనాలు ఆలయాలకు సమీపంలో, పట్టణ నడిబొడ్డున జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న ట్లు ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.