విజయనగరం జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు
ABN , First Publish Date - 2021-11-26T21:40:21+05:30 IST
జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. భూ వివాదంలో ముగ్గురిపై
విజయనగరం: జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. భూ వివాదంలో ముగ్గురిపై వైసీపీ సర్పంచ్, కుటుంబసభ్యులు దాడి చేశారు. గజపతినగరం మండలం లింగాలవలసలో కానిస్టేబుల్ శ్రీనివాసరావు, తండ్రి, సోదరిని సర్పంచ్ బొత్స కృష్ణ చితకబాదారు. కుటుంబసభ్యులు బొత్స అప్పారావు, బొత్స సత్యనారాయణ, బొత్స అప్పలనాయుడు అనే ముగ్గురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించారు.