ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-12-04T05:09:02+05:30 IST

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
సభ్యత్వ నమోదులో పాల్గొన్న గోవర్దన్‌యాదవ్‌

షాబాద్‌: పాఠశాలలు ప్రారంభించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్దన్‌యాదవ్‌ అన్నారు. గురువారం షాబాద్‌ మండలం సర్దార్‌నగర్‌, షాబాద్‌, హైతాబాద్‌ ఉన్నత పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయుల పీఆర్సీ, సర్వీస్‌ రూల్స్‌, ప్రమోషన్లు, బదిలీలు ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలన్నారు. ఆరు నెలల నుంచీ విద్యార్థులు చదువుకు దూరమయ్యారని, ప్రభుత్వం వెంటనే పాఠశాలలను ప్రారంభించి సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు యాదయ్య, సుదర్శన్‌, హరికృష్ణ, టీచర్లు ఝూన్సీరాణి, నర్సింహులు, మల్లేష్‌, రాఘవేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T05:09:02+05:30 IST