నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్
ABN , First Publish Date - 2021-02-28T16:05:08+05:30 IST
పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
నెల్లూరు: పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తొలి ప్రైవేట్ వాణిజ్య ప్రయోగంగా ఇది రికార్డులకెక్కింది. మొత్తం 19 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో ఉన్న ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ-సీ51ని ప్రయోగించారు. శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభంకాగా, ఆదివారం ఉదయం 10.24కు కౌంట్డౌన్ జీరోకు చేరుకోగానే నింగిలోకి దూసుకు వెళ్లింది.
ప్రయోగానంతరం పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ 1.55 గంటలపాటు రోదసిలో పయనించనుంది. బయలుదేరిన 17.23 నిమిషాలకు బ్రెజిల్కు చెందిన 637 కిలోల అమెజోనియ-1 ఉపగ్రహాన్ని సూర్యానువర్తన ధృవకక్ష్య(సన్ సింక్రనైజ్ పోలార్ ఆర్బిట్)లోకి చేరవేయనుంది. అనంతరం నాలుగు నిమిషాలలో మిగిలిన 18 బుల్లి ఉపగ్రహాలను కక్ష్యల్లో వదిలిపెట్టనుంది.