మల్లేపల్లిలో సైకో వీరంగం
ABN , First Publish Date - 2021-11-28T06:30:51+05:30 IST
మండలంలోని మల్లేపల్లి గ్రామంలో శనివారం సైకో వీరంగం చేశాడు.
డోన్, నవంబరు 27: మండలంలోని మల్లేపల్లి గ్రామంలో శనివారం సైకో వీరంగం చేశాడు. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సైకో విద్యుత్ స్తంభాలకు, రాళ్లతో బాదుకొని రక్తగాయాలు చేసుకున్నాడు. రాళ్లు చేతపట్టుకొని గ్రామంలో సంచరించాడు. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదని గ్రామస్థులు అంటున్నారు. పోలీసులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.