వైసీపీ నేతల అక్రమ క్వారీలపై ప్రజల ధర్నా

ABN , First Publish Date - 2022-01-31T20:55:48+05:30 IST

విజయపురం మండలంలో వైసీపీ నేతల అక్రమ క్వారీలను

వైసీపీ నేతల అక్రమ క్వారీలపై ప్రజల ధర్నా

చిత్తూరు: విజయపురం మండలంలో వైసీపీ నేతల అక్రమ క్వారీలను నిరసిస్తూ చిత్తూరు కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో బాధిత గ్రామాల ప్రజలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత ఆర్క్‌కాట్ గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూముల్లోని విలువైన  మైనింగ్  సంపద  అక్రమంగా తమిళనాడుకు తరలిపోతోందని వారు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో స్థానిక వైసీపీ నేతలు క్వారీలను పొంది తరలించుకుపోతున్నారని వారు తెలిపారు. క్వారీ పనుల వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే క్వారీ లైసెన్సులను రద్దు చేసి వైసీపీ నేతల ధన దాహానికి బలికాకుండా ఆ భూములను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ భూములను స్థానికంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచాలని కోరారు.  వైసీపీ నేతలకు స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.వైసీపీ నేతల ధనార్జనకు విలువైన భూములు బలవుతున్నాయన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపైన స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-31T20:55:48+05:30 IST