కేంద్రం జోక్యం చేసుకుని ఎన్నికలు నిర్వహించాలి: కమ్యూనిస్టులు

ABN , First Publish Date - 2021-01-25T17:09:47+05:30 IST

నోటిఫికేషన్ ప్రకారం సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా...

కేంద్రం జోక్యం చేసుకుని ఎన్నికలు నిర్వహించాలి: కమ్యూనిస్టులు

నెల్లూరు: ఏపీ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా ఇంత వరకు రెవిన్యూ డివిజన్లలో ఎక్కడా ఎటువంటి ఏర్పాట్లు జరగలేదు. ఈ సందర్భంగా నెల్లూరులో కమ్యూనిస్టులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన సమయంలో ఉద్యోగులు అధికారం అడ్డంపెట్టుకుని నామినేషన్లు వేయనీయకుండా చేయడం దారుణమని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు స్థాయి మరిచి ఎన్నికల కమిషనర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎన్నికలు నిర్వహించాలని కోరారు.


గ్రామస్థాయిలో ఎలాంటి అభివృద్ధి జరగడంలేని, వైసీపీ ఎమ్మెల్యేలు, వాళ్ల కార్యకర్తలకే మేలు జరుగుతోందని కమ్యూనిస్టులు విమర్శించారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం, కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వం అభివృద్ది చేయడంలేదని ఆరోపించారు. అధికారులు వైసీపీ కార్యకర్తలు కాదని, ఉద్యోగులన్న విషయం గుర్తుపెట్టుకుని ఈ రోజు నుంచే నామినేషన్లు స్వీకరించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-01-25T17:09:47+05:30 IST