వైసీపీ ప్రభుత్వంలో ప్రజా జీవనం అస్తవ్యస్తం
ABN , First Publish Date - 2022-09-24T05:34:36+05:30 IST
వైసీపీ ప్రభుత్వంలో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. హనుమంతునిపాడు మండలంలోని నందనవనం గ్రామంలో శుక్రవారం రాత్రి బాదుడే బాదుడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఉప్పు నుంచి పప్పు, నూనె నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయని చెప్పారు.