ప్రజల అర్జీలను వెంటనే పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-07-27T06:34:23+05:30 IST
ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు.
సూర్యాపేట (కలెక్టరేట్), జూలై 26: ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజావాణిలో అందించిన దరఖాస్తులను స్వీకరించి సంబంధి త అధికారులకు పంపిస్తామన్నారు. భూసంబంధిత సమస్యలు, పింఛన్లు, డబుల్ బెడ్ రూం దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఏవో శ్రీదేవి, పీడీఐసీడీఎస్ నర్సింహారావు, పులి సైదులు, అధికారులు పాల్గొన్నారు.