ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-07-25T05:45:28+05:30 IST

సచివాలయాలకు వివిధ సమస్యలపై వచ్చే ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ ఆదేశించారు.

ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి

  1. సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌


నంద్యాల, జూలై 24: సచివాలయాలకు వివిధ సమస్యలపై వచ్చే ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ ఆదేశించారు. శనివారం నంద్యాల మండలం పోలూరు గ్రామ సచివాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంలో సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామ పరిధిలో ఎంతమందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు, వారిలో ఎవరెవరికి ప్రాధాన్యం ఇచ్చారన్న అంశాలను పరిశీలించారు. ఉద్యోగుల హాజరు పట్టిక, మూమెంట్‌ రిజిష్టర్‌, సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను పరిశీలించారు. ఆమె వెంట సచివాలయ సిబ్బంది ఉన్నారు. 



Updated Date - 2021-07-25T05:45:28+05:30 IST