పశువుల పాకగా మారిన ప్రభుత్వ పాఠశాల

ABN , First Publish Date - 2021-07-27T06:18:33+05:30 IST

మండలంలోని వంకతండా గ్రామ ప్రాథమిక పాఠశాల పశువుల పాకగా మారింది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి.

పశువుల పాకగా మారిన ప్రభుత్వ పాఠశాల
ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పశువులను కట్టేసిన దృశ్యం

బ్రహ్మసముద్రం, జూలై 26: మండలంలోని వంకతండా గ్రామ ప్రాథమిక పాఠశాల పశువుల పాకగా మారింది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో గ్రా మంలోని ఓ రైతు పాఠశాల ఆవరణలో పశువులను కట్టివేసి పశువుల పాకగా మార్చారు. పశువుల పేడ, గడ్డి, చెత్తాచెదారంతో పాఠశాల ఆవరణమంతా అపరిశుభ్రంగా మారింది. నాడు-నేడు పథకం కింద ప్రభుత్వం పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని సంకల్పిస్తే.. ఉపాధ్యాయులు పర్యవేక్షణ కొరవడి పశువుల పాకగా మారాయి. విద్యార్థులు రాకపోవడం తో పశువుల ఆవాసంగా మారింది. ఈవిషయాన్ని గ్రామస్థులు మండల విద్యాధికారి ఓబుళపతి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఇక నుంచి పాఠశాలల్లో పశువులను రా కుండా గేట్‌కు తాళాలు వేస్తామని తెలిపారు. రైతులు కూడా ఇక ముందు పాఠశాలల్లో ప శువులు ఉంచకూడదని హెచ్చరించారు.

Updated Date - 2021-07-27T06:18:33+05:30 IST