బండి సంజయ్ తొండి సంజయ్: Jeevan reddy

ABN , First Publish Date - 2022-07-07T18:21:15+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

బండి సంజయ్ తొండి సంజయ్: Jeevan reddy

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi sanjay)పై పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి (Jeevan reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..  బండి సంజయ్ తొండి సంజయ్ అని... గుండు అరవింద్ (Aravind), లండు అరవింద్ అని వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపినట్లు చెప్పిన దానిపై తాను ఆర్టీఐ (RTI)లో వివరాలు కోరామన్నారు. ప్రధాని విద్యార్హతలపై కూడా వివరాలు అడిగినట్లు చెప్పారు. మోదీ వస్త్రాల ధరలు, వాటిని కుట్టిన దర్జీ జీతం వివరాలు కోరామన్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్‌కు ఏమైనా నిధులు ఇచ్చారా అని అడుగుతున్నామని అన్నారు. ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు ఎంత? గత ప్రధానుల విదేశీ పర్యటనల ఖర్చు ఎంత?... ఇలా తమకు అనుమానాలు ఉన్న అనేక అంశాలపై ఆర్టీఐ ద్వారా వివరాలు కోరుతున్నామని తెలిపారు. గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచారని మండిపడ్డారు. పరిస్థితి గ్యాస్ నుంచి కట్టెల పొయ్యికి వచ్చింది జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 


Updated Date - 2022-07-07T18:21:15+05:30 IST