‘బండి సంజయ్‌కి పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది’

ABN , First Publish Date - 2021-11-20T22:52:05+05:30 IST

కేసీఆర్ హైదరాబాద్‌లో గర్జిస్తే ఢిల్లీలో కేంద్రం దిగి వచ్చిందని పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. బండి లేని సంజయ్- ఎడ్లు లేని రేవంత్ మాటలు ఎక్కడ పోయాయి? అని ప్రశ్నించారు.

‘బండి సంజయ్‌కి పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది’

హైదరాబాద్: కేసీఆర్ హైదరాబాద్‌లో గర్జిస్తే ఢిల్లీలో కేంద్రం దిగి వచ్చిందని పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. బండి లేని సంజయ్- ఎడ్లు లేని రేవంత్ మాటలు ఎక్కడ పోయాయి? అని ప్రశ్నించారు. దేశద్రోహులు- దళారులు ధర్నాలు చేస్తే కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ నవంబర్‌లో దీక్ష చేస్తే  తెలంగాణ వచ్చిందన్నారు. ఇప్పుడు మళ్లీ నవంబర్‌లో ధర్నా చేస్తే చట్టాలను వెనక్కి వెళ్లాయని పేర్కొన్నారు. దొంగలు పడ్డంక ఆరు నెలలకు ఏవో మొరిగినట్లు రేవంత్ ఇప్పుడు నోరు విప్పారని విమర్శించారు. నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్ల పై టీఆరెస్ నిరసన చేస్తుంటే రేవంత్ ఎక్కడ పోయారు? అని ఆయన ప్రశ్నించారు. వరి కళ్లాలా దగ్గర బండి సంజయ్‌కి పట్టిన గతే రేవంత్‌కు పడుతుందన్నారు. ధాన్యం కొనేలా? రేవంత్ రెడ్డి సోనియాగాంధీ తో మాట్లాడి బీజేపీ పై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమంలో అమరులైన కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-11-20T22:52:05+05:30 IST