పుడ్డింగ్ ఎండ్ మింక్ పబ్ కేసులో విచారణలో నోరు మెదపని నిందితులు
ABN , First Publish Date - 2022-04-17T00:31:16+05:30 IST
పుడ్డింగ్ ఎండ్ మింక్ పబ్ కేసులో విచారణలో నోరు మెదపని నిందితులు
హైదరాబాద్: పుడ్డింగ్ ఎండ్ మింక్ పబ్ కేసులో నిందితుల మూడవరోజు కస్టడీ ముగిసింది. గత మూడు రోజులుగా పోలీసులు విచారిస్తున్నా నిందితులు నోరు మెదపలేదని పోలీసులు చెబుతున్నారు. ఎన్ని ప్రశ్నలు అడిగిన నిందితులు తమకు తెలియదు అంటూ జవాబు ఇస్తున్నాని తెలిపారు. డ్రగ్స్ కు తమకు ఎటువంటి సంబంధం లేదు అని అభిషేక్ చెబుతున్నారు. నిందితుల కస్టడీ రేపే చివరి రోజు అని, ఇప్పటివరకు నిందితుల నుంచి పోలీసులు ఎటువంటి సమాధానం రాబట్ట లేదని తెలుస్తోంది.