Chief Minister: వందేళ్లు దాటిన వారికి వరం

ABN , First Publish Date - 2022-08-30T13:35:14+05:30 IST

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో వందేళ్లు దాటిన వృద్ధులకు నెలకు రూ.7 వేల పింఛన్‌ ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగస్వామి(Chief

Chief Minister:  వందేళ్లు దాటిన వారికి వరం

- నెలకు రూ.7 వేల పింఛన్‌

- పుదువై సీఎం రంగస్వామి


పుదుచ్చేరి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో వందేళ్లు దాటిన వృద్ధులకు నెలకు రూ.7 వేల పింఛన్‌ ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగస్వామి(Chief Minister Rangaswamy) ప్రకటించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా సోమవారం సీఎం మాట్లాడుతూ 15 వేల వృద్ధాప్య పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయని, సెప్టెంబరు 1 నుంచి వారికి నెలనెలా పింఛన్‌ అందజేయనున్నామన్నారు. 90 నుంచి 100 ఏళ్లలోపున్న వారికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3,500లు రూ.4 వేలకు పెంచుతున్నామన్నారు. చేపల వేటకు వెళ్లి మృతిచెందే జాలర్ల కుటుంబాలకు అందజేసే ఆర్ధికసాయం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు రంగస్వామి ప్రకటించారు. 

Updated Date - 2022-08-30T13:35:14+05:30 IST