పుదుచ్చేరిలో అక్టోబర్ 31వరకు corona curfew పొడిగింపు

ABN , First Publish Date - 2021-10-16T12:46:49+05:30 IST

పుదుచ్చేరిలో కరోనా కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను ఈ నెల 31వతేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది...

పుదుచ్చేరిలో అక్టోబర్ 31వరకు corona curfew పొడిగింపు

పుదుచ్చేరి : పుదుచ్చేరిలో కరోనా కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను ఈ నెల 31వతేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది.పుదుచ్చేరిలో గడచిన 24 గంటల్లో 37 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. పుదుచ్చేరిలో మొత్తం 1,27,296 కరోనా కేసులు నమోదైనాయని పుదుచ్చేరి వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. మరో 15రోజుల పాటు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ, కొవిడ్ మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్రపాలిత ప్రాంత అధికారులు నిర్ణయించారు. కరోనా కట్టడి కోసం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు విధించాలని నిర్ణయించారు.


వాణిజ్య సంస్థలు 100 శాతం వ్యాక్సిన్ వేయించుకున్న సిబ్బందితో నడపాలని ఆదేశించారు.కరోనా సోకకుండా ప్రజలు మాస్కులు ధరించవాణిజ్య సంస్థలు 100 శాతం వ్యాక్సిన్ వేయించుకున్న సిబ్బందితో నడపాలని ఆదేశించారు.కరోనా సోకకుండా ప్రజలు మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.వివాహాలకు 100 మందిని, ప్రార్థనా మందిరాల్లోకి ఒకసారి 25 మందిని, అంత్యక్రియలకు 20 మందిని అనుమతించేలా చూడాలని ఆదేశించారు. 


డంతోపాటు సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.వివాహాలకు 100 మందిని, ప్రార్థనా మందిరాల్లోకి ఒకసారి 25 మందిని, అంత్యక్రియలకు 20 మందిని అనుమతించేలా చూడాలని ఆదేశించారు. 


Updated Date - 2021-10-16T12:46:49+05:30 IST