గొర్రెల మందపై పులి దాడి

ABN , First Publish Date - 2021-01-24T05:51:42+05:30 IST

గొర్రెల మందపై పెద్దపులి దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది.

గొర్రెల మందపై పులి దాడి
మృతిచెందిన గొర్రె

వెల్దుర్తి, జనవరి 23: గొర్రెల మందపై పెద్దపులి దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పాపిరెడ్డికుంటకు చెందిన జీవాల కాపరులు గ్రామం వెలుపల పశువుల దొడ్డి వేసి జీవాలను ఉంచారు. అర్థరాత్రి సమయంలో పెద్దపులి జీవాలపై దాడి చేసింది. ఈ దాడిలో ఒక గొర్రె మృతిచెందగా, కొన్నిటికి గాయాలయ్యాయి. కుక్క అరవడంతో పెద్దపులి అడవిలోకి పారిపోయింది. ఫారెస్ట్‌ రేంజర్‌ సుబ్బారావు శనివారం పరిశీలించారు. అక్కడి అడుగుజాడలను బట్టి దాడి చేసింది పెద్దపులి అని నిర్ధారించారు. 


Updated Date - 2021-01-24T05:51:42+05:30 IST