స్వచ్ఛమైన నేతి మిఠాయిలో విషపు చుక్కలు!

ABN , First Publish Date - 2022-05-26T23:51:42+05:30 IST

పుల్లారెడ్డి నేతి మిఠాయిలు రాష్ట్రంలో విశిష్టమైన స్థానం సంపాదించుకున్నాయి. స్వీట్ల సామ్రాజ్యంలో చేదు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

స్వచ్ఛమైన నేతి మిఠాయిలో విషపు చుక్కలు!

హైదరాబాద్‌: పుల్లారెడ్డి నేతి మిఠాయిలు రాష్ట్రంలో విశిష్టమైన స్థానం సంపాదించుకున్నాయి. స్వీట్ల సామ్రాజ్యంలో చేదు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కట్టుకున్న భార్యపై పుల్లారెడ్డి మనవడి విక‌ృత చేష్టలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. భార్యను బంధించి హింస, వేధింపులకు దిగుతున్నాడని చెబుతున్నారు. స్వచ్ఛమైన నేతి మిఠాయిలో విషపు చుక్కలు వెదజల్లుతున్నాడు. పుల్లారెడ్డి మనవడి విక‌ృత చేష్టలపై ఆ ఇంటి కోడలు ప్రజ్ఞారెడ్డి  ABNను ఆశ్రయించారు. భర్త, అత్త, మామ, తనను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయం బయటికి చెబితే తన తల్లిదండ్రులను కూడా చంపేస్తామని బెదిరించారని వాపోయారు. రెండేళ్లుగా అత్తింట్లో నరకం చూస్తున్నానని విలపించారు. ఆడబిడ్డ పుట్టిందని, ఏడేళ్లుగా నరకం చూపిస్తున్నారని, లింగనిర్ధారణ పరీక్షలు చేయించారని ప్రజ్ఞారెడ్డి తెలిపారు. మగపిల్లాడి కోసం థాయ్‌ల్యాండ్‌ వైద్యం చేయించుకోమని ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. బయట ప్రైవేటు మనుషులతో నిఘా పెడుతున్నారని, ఇప్పటికి మామ రాఘవరెడ్డితో తనకు ప్రాణహాని ఉందని, ఆయన గన్‌మెన్లు తనను ఫాలో అవుతున్నారని తెలిపారు. తన భర్త తప్పు తెలుసుకుని వస్తే కలిసి ఉంటానని చెప్పారు. 


సమస్య పరిష్కారం కోసం రెండేళ్లుగా ప్రయత్నించానని, వదిలించుకోవడమే లక్ష్యంగా తన కూతురికి వేధిస్తున్నారని ప్రజ్ఞారెడ్డి తండ్రి కేఆర్ఎం రెడ్డి తెలిపారు. తెలంగాణ పోలీసులపై తమకు నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని కేఆర్ఎం రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-05-26T23:51:42+05:30 IST