గణపయ్యకు కానుకగా 10 కిలోల స్వర్ణ కిరీటం... ఖరీదు ఎంతంటే?
ABN , First Publish Date - 2021-09-13T11:42:14+05:30 IST
మహారాష్ట్రలోని దగ్ఢూ సేఠ్ హల్వాయ్ గణపతికి నవరాత్రులు...
పూణె: మహారాష్ట్రలోని దగ్ఢూ సేఠ్ హల్వాయ్ గణపతికి నవరాత్రులు నిర్వహిస్తున్న సందర్భంగా ఒక భక్తుడు 10 కిలోల బంగారు కిరీటాన్ని బహూకరించాడు. అయితే ఈ భక్తుడు తన పేరు వెల్లడించలేదు. మీడియాతో దగ్ఢూ సేఠ్ హల్వాయ్ గణపతి మండప నిర్వాహక కమిటీ సభ్యులు మహేశ్ సూర్యవంశీ మాట్లాడుతూ పూణేకు చెందిన ఒక వ్యాపారవేత్త ఈ బంగారు కిరీటాన్ని గణపయ్యకు కానుకగా పంపించారన్నారు.
ఈ కిరీటం ప్రత్యేకత ఏమంటే... దీనిపై అద్భుత కళాకృతులు రూపుదిద్దుకున్నాయి. కిరీటం పైభాగంలో శివపార్వతుల రూపాలు కనిపిస్తాయి. కాగా ఈ 10 కిలోల బంగారు కిరీటం విలువ మార్కెట్లో ఐదు కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. ఈ కిరీటం కోసం వాడిన బంగారం ఖరీదు నాలుగు కోట్ల వరకూ ఉండవచ్చు. దీనిని కిరీటంగా మలచినందుకు రూ. 80 లక్షల వరకూ ఖర్చయివుంటుందని మండప నిర్వాహకులు తెలిపారు.