పుణెలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

ABN , First Publish Date - 2021-02-28T22:52:37+05:30 IST

పుణెలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

పుణెలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

పుణె: మహారాష్ట్రలోని పుణె పట్టణంలో నైట్ కర్ఫ్యూను పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు మార్చి 14 వరకు మూసివేయబడతాయని పుణె మేయర్ ముర్లిధర్ మొహల్ పేర్కొన్నారు. ఇంతకుముందు విధించిన ఆంక్షలను మార్చి 14 వరకు పొడిగించారని ఆయన తెలిపారు.


రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య అవసరమైన సేవలు అనుమతించబడతాయని అధికారులు వెల్లడించారు. కోవిడ్-19 సంక్రమణ వ్యాప్తి మందగించనందున మార్చి 14 వరకు పాఠశాలలు, కళాశాలలు మరియు కోచింగ్ తరగతులు మూసివేయబడతాయని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2021-02-28T22:52:37+05:30 IST