మాస్క్ పెట్టుకోని జగన్కు ఏ శిక్ష విధిస్తారు?: నారా లోకేష్
ABN , First Publish Date - 2021-07-21T20:16:14+05:30 IST
దళితులంటే సీఎం జగన్రెడ్డికి ఎందుకింత కక్ష అని టీడీపీ నారా నారా లోకేష్ ప్రశ్నించారు. చీరాలలో దళిత యువకుడు కిరణ్కుమార్ను
అమరావతి: దళితులంటే సీఎం జగన్రెడ్డికి ఎందుకింత కక్ష అని టీడీపీ నారా లోకేష్ ప్రశ్నించారు. చీరాలలో దళిత యువకుడు కిరణ్కుమార్ను మాస్క్ లేదని, వైసీపీ పోలీసులు కొట్టి చంపి ఏడాదైందని గుర్తుచేశారు. నిందితులైన పోలీసులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, జగన్రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో దళితులకు బతికే హక్కులేదా? అని లోకేష్ ప్రశ్నించారు. మాస్క్ పెట్టుకోకపోవడమే నేరమైతే.. రోజూ మాస్క్ పెట్టుకోని జగన్రెడ్డికి ఏ శిక్ష విధిస్తారు? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కిరణ్ మృతికి కారణమైన వారిని శిక్షించాలని, కిరణ్కుమార్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు.