పంజాబ్‌లో 12వ తరగతి పరీక్షలు రద్దు!

ABN , First Publish Date - 2021-06-20T04:28:15+05:30 IST

12వ తరగతి పరీక్షలను పంజాబ్ ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది.

పంజాబ్‌లో 12వ తరగతి పరీక్షలు రద్దు!

చండీగఢ్: 12వ తరగతి పరీక్షలను పంజాబ్ ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ఈ పరీక్షలను నిలిపివేసేందుకు నిర్ణయించినట్టు పంజాబ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి విజయ్ ఇంద్ర సింగ్లా శనివారం నాడు తెలిపారు. కరోనా సంక్షోభం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. సీబీఎస్సీ ఇటీవల ప్రకటించిన విధానంలోనే విద్యార్థుల ఉత్తీర్ణత గ్రేడ్లను నిర్ణయిస్తామని కూడా తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో కూడా పరీక్షలు రద్దు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ కూడా ఇటీవలే 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. 10, 11, 12వ తరగతిలో విద్యార్థి కనబరిచిన ప్రతిభ ఆధారంగా తుది ఫలితాన్ని నిర్ణయిస్తామని సీబీఎస్సీ ప్రకటించింది. 

Updated Date - 2021-06-20T04:28:15+05:30 IST