భారీ వర్షంలో రోడ్డు నిర్మాణ పనులు.. నలుగురు అధికారులపై వేటు

ABN , First Publish Date - 2022-07-10T22:23:21+05:30 IST

హోషియార్‌పూర్: పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో భారీ వర్షంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన నలుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు.

భారీ వర్షంలో రోడ్డు నిర్మాణ పనులు.. నలుగురు అధికారులపై వేటు

హోషియార్‌పూర్: పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో భారీ వర్షంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన నలుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు. ప్రజాపనుల విభాగానికి చెందిన సబ్ డివిజనల్ ఇంజినీర్ తర్సెమ్ సింగ్, జూనియర్ ఇంజినీర్లు విపన్ కుమార్, పర్వీన్ కుమార్, జస్బీర్ సింగ్‌లను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. హోషియార్‌పూర్‌లోని షెర్పూర్ డకో గ్రామంలో కుండపోత వాన కురుస్తుండగా వీరు రోడ్లు వేశారు. దీన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో అధికారులు కన్నెర్ర చేశారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన నలుగురిపై వేటేశారు.      



Updated Date - 2022-07-10T22:23:21+05:30 IST