పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్

ABN , First Publish Date - 2022-02-28T23:35:18+05:30 IST

టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆ జట్టు సోమవారం..

పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్

న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆ జట్టు యాజమాన్యం సోమవారం ప్రకటించింది. 2018 నుంచి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మయాంక్ ఆ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. గత సీజన్‌లో కొన్ని మ్యాచులకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.


పంజాబ్ జట్టు సారథ్య బాధ్యతలు తనకు అప్పగించడంపై మయాంక్ స్పందిస్తూ జట్టును నడిపించే బాధ్యతను తనకు అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఓ గొప్ప జట్టుకు నాలుగేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉందన్నాడు. జట్టులో మంచి నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు ఉన్నారని, దీంతో తన పని మరింత సులభమవుతుందని పేర్కొన్నాడు.


జట్టుగా గెలవాలనే తాము ప్రతిసారీ మైదానంలోకి దిగుతామన్నాడు. ఈసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో శిఖర్ ధవన్, జానీ బెయిర్‌స్టో, షారూఖ్ ఖాన్, కగిసో రబడ వంటి వారిని పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.


 పంజాబ్ జట్టు: మయాంక్ అగర్వాల్, అర్షదీప్ సింగ్, శిఖర్ ధవన్, కగిసో రబడ, జానీ బెయిర్‌స్టో, రాహుల్ చాహర్, షారూఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జితేశ్ శర్మ, ఇషాన్ పోరల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఒడియన్ స్మిత్, సందీప్ శర్మ, రాజ్ అంగద్ బవా, రిషీ ధవన్, ప్రేరక్ మన్కడ్, వైభవ్ అరోరా, రిటిక్ చటర్జీ, బాల్తేజ్ దండా, అన్ష్ పటేల్, నాథన్ ఎల్లిస్, అథర్వ టైడే, భానుక రాజపక్స, బెన్సీ హోవెల్. 


Updated Date - 2022-02-28T23:35:18+05:30 IST