IPL 2022: సమ ఉజ్జీల మధ్య పోరు.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్
ABN , First Publish Date - 2022-05-17T00:54:48+05:30 IST
ఐపీఎల్లో నేడు రెండు సమ ఉజ్జీలైన పంజాబ్ కింగ్స్ (Punjab Kings)-ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals) తలపడబోతున్నాయి
ముంబై: ఐపీఎల్లో నేడు రెండు సమ ఉజ్జీలైన పంజాబ్ కింగ్స్ (Punjab Kings)-ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals) తలపడబోతున్నాయి. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడి ఆరేసి విజయాలు సాధించాయి. మెరుగైన రన్ రేట్ కారణంగా ఢిల్లీ జట్టు ఐదో స్థానంలో ఉండగా, పంజాబ్ ఏడో స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధించినా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. దీంతో నేటి పోరు ప్రేక్షకులకు మజా పంచే అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు బలంగా ఉన్నాయి. పంజాబ్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, ఢిల్లీ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా దూరమైన ఖలీల్ అహ్మద్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. కాబట్టి చేతన్ సకారియా బెంచ్కు పరిమితమయ్యాడు.
అలాగే, కేఎస్ భరత్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్కు తుది జట్టులో స్థానం దక్కింది. 2018 నుంచి ఈ రెండు జట్లు 9 సార్లు పరస్పరం పోటీ పడగా పంజాబ్ కింగ్స్ ఐదుసార్లు విజయం సాధించింది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ పవర్ప్లేలో ఐదుసార్లు 60కిపైగా పరుగులు సాధించగా, ఢిల్లీ మూడుసార్లు మాత్రం 60కిపైగా పరుగులు చేసింది.