Punjab: బైక్ ఇంధన ట్యాంక్ పేలి రైడరుకు గాయాలు
ABN , First Publish Date - 2021-09-16T13:58:18+05:30 IST
బైక్ ఇంధన ట్యాంకు పేలడంతో బైకరు గాయపడిన దుర్ఘటన పంజాబ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి జరిగింది....
చండీఘఢ్: బైక్ ఇంధన ట్యాంకు పేలడంతో బైకరు గాయపడిన దుర్ఘటన పంజాబ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి జరిగింది. ఫజిల్కా జిల్లాలోని జలాలాబాద్లో బుధవారం రాత్రి ఓ యువకుడు మోటార్సైకిల్ పై వెళుతుండగా ఇంధన ట్యాంక్ పేలి తీవ్రంగా గాయపడ్డాడు.పేలుడుకు గల కారణం తెలియాల్సి ఉంది. బుధవారం రాత్రి 22 ఏళ్ల ఓ యువకుడు బంధవుల ఇంటికి తన మోటారుసైకిలుపై జలాలబాద్ లోని పాత సబ్జీమండీ నుంచి బ్యాంకు రోడ్డు వైపు వెళుతుండగా అకస్మాత్తుగా బైక్ ఫ్యూయల్ ట్యాంకు పేలింది. ఈ పేలుడులో బైకర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందం వచ్చి బైక్ ఇంధన ట్యాంకు పేలుడుకు కారణాలపై దర్యాప్తు ప్రారంభించింది. పోలీసులు కేసు నమోదు చేసి పేలుడుపై దర్యాప్తు సాగిస్తున్నారు.