మూసేవాలా హత్య కేసులో gangster Lawrence Bishnoiకు 7 రోజుల రిమాండ్

ABN , First Publish Date - 2022-06-15T14:00:13+05:30 IST

గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి మాన్సా కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీకి...

మూసేవాలా హత్య కేసులో gangster Lawrence Bishnoiకు 7 రోజుల రిమాండ్

చండీఘడ్ (పంజాబ్): గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి మాన్సా కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీకి తరలించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను బుధవారం తెల్లవారుజామున మాన్సా వద్దకు తీసుకొచ్చారు. అతనికి మొదట వైద్య పరీక్షలు నిర్వహించి స్థానిక కోర్టులో హాజరుపరచగా అతనికి 7 రోజుల పోలీసు కస్టడీ విధించింది.వాస్తవానికి పోలీసులు 10 రోజుల పోలీసు కస్టడీ కోరారు.కాని కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించింది.ప్రశ్నించేందుకు లారెన్స్ బిష్ణోయ్‌ని మొహాలీకి తీసుకురానున్నారు.సిద్ధూ మూసేవాలా హత్య కేసులో  లారెన్స్ బిష్ణోయ్‌ పాత్రకు సంబంధించి గ్యాంగ్‌స్టర్ వ్యతిరేక టాస్క్‌ఫోర్స్ ఇతర ఏజెన్సీలతో కూడిన ప్రత్యేక బృందం  ప్రశ్నించనుంది.



గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు పంజాబ్ పోలీసులు మంగళవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ విధించారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ స్వయంగా ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టుకు హాజరై రిమాండ్‌ విధించాలని డిమాండ్‌ చేశారు.పంజాబ్ పోలీసు కస్టడీలో అతని భద్రత కారణంగా నిందితుడు లారెన్స్ బిష్ణోయ్ యొక్క న్యాయవాదులు పంజాబ్ పోలీసుల అభ్యర్ధనను వ్యతిరేకించారు, దీనిని అడ్వకేట్ జనరల్ పంజాబ్ వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నిందితులను అరెస్టు చేసేందుకు కోర్టు అనుమతిని మంజూరు చేసింది.

Updated Date - 2022-06-15T14:00:13+05:30 IST