బీజేపీ చేతిలో కీలుబొమ్మలు : తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-03-07T05:07:10+05:30 IST

వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి విమర్శించారు.

బీజేపీ చేతిలో కీలుబొమ్మలు : తులసిరెడ్డి

వేంపల్లె, మార్చి 6: వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి విమర్శించారు. వేంపల్లెలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ మోసగానితనంతో, వైసీపీ, టీడీపీ చేతగాని తనం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా రాలేదని, రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కాలేదన్నారు. బీజేపీకి వైసీపీ, టీడీపీ, జనసేనలు బానిస పార్టీలని ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి కామధేవును లాంటి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ముస్లిం వ్యతిరేక పౌరసత్వ చట్టానికి, రైతుల వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు, కార్మిక వ్యతిరేక కార్మిక చట్టాలకు, వైసీపీ, టీడీపీ జనసేన పార్టీలు మద్దతిచ్చాయని గుర్తు చేశారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు రామకృష్ణ, నరసింహారెడ్డి, ఉత్తన్న, సుబ్బరాయుడు, సత్తార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T05:07:10+05:30 IST