వచ్చే నెల 25 నుంచి తెరుచుకోనున్న పూరీ జగన్నాథ్ ఆలయం
ABN , First Publish Date - 2021-06-17T05:14:59+05:30 IST
పూరీలోని ప్రఖ్యాత జగన్నాథ ఆలయాన్ని వచ్చే నెల 25 నుంచి భక్తుల సందర్శనల కోసం తెరవనున్నట్టు అధికారులు వెల్లడించారు. ..
పూరి: పూరీలోని ప్రఖ్యాత జగన్నాథ ఆలయాన్ని వచ్చే నెల 25 నుంచి భక్తుల సందర్శనల కోసం తెరవనున్నట్టు అధికారులు వెల్లడించారు. శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన మండలి (ఎస్జీటీఏ) ప్రధాన పాలకుడు కృష్ణకుమార్ నేృతృత్వంలో ఇవాళ జరిగిన సమావేశం అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 15 వరకు భక్తుల సందర్శనలు నిలిపివేస్తూ గతంలో ప్రకటించగా.. దీన్ని తాజాగా వచ్చే నెల 25 వరకు పొడిగించారు. రథయాత్ర వేడుకలు ముగిసిన రెండ్రోజుల తర్వాత ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నట్టు ఎస్జీటీఏ పేర్కొంది.