ప్రిడేటర్ డ్రోన్ నుంచి ఎవరూ తప్పించుకోలేరని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను `పూరీ మ్యూజింగ్స్` పేరుతో ఆయన పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ తాజాగా `ప్రిడేటర్ డ్రోన్` గురించి మాట్లాడారు.
` ప్రిడేటర్ డ్రోన్.. ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ డ్రోన్. రైఫిల్స్, మిస్సైల్స్ను తీసుకెళ్తుంది. పది అడుగుల పొడవుంటుంది. దాని రెక్కలు 55 అడుగుల పొడవుంటాయి. 25 వేల అడుగుల ఎత్తులో ఎగరగలదు. గాలిలో 20 నుంచి 30 గంటలు ఉండగలదు. అది ఒక డేగ. అది పైన ఎక్కడో ఉంటే సిటీ మొత్తం సర్వైలెన్స్లో ఉన్నట్టే. ఎక్కడ కావాలనుకుంటే అక్కడకు జూమ్ చేసి సిటీలో ఉండే ప్రతి ఒక్కరినీ క్లోజ్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎన్నో వేల మంది టెర్రరిస్ట్లు చనిపోవడంలో, ఐసిస్ నాశనం కావడంలో ఈ డ్రోన్దే కీలక పాత్ర. ఈ డ్రోన్ అంటే టెర్రరిస్ట్లకు చాలా భయం. ఒక రోజు పాకిస్థాన్లోని అబోటాబాద్లోని ఓ అనుమానాస్పద ఇల్లు ప్రిడేటర్ డ్రోన్ ద్వారా అమెరికా సీఐఏ కంటపడింది. ఆ ఇంటికి కరెంట్ సప్లై, ఫోన్ కనెక్షన్ లేదు. ఆ ఇంటి గేటు ఎప్పుడూ తెరిచేవారు కాదు. రోజూ సాయంత్రం 5 గంటల సమయంలో ఓ వ్యక్తి ఇంటి కాంపౌండ్లో వాకింగ్ చేసేవాడు. ఆ వాకింగ్ చేస్తున్న వ్యక్తి నీడ ఆధారంగా అతడి హైట్ 6.3 అని తెలుసుకున్నారు. ఆ హైట్ ఆధారంగా ఆ నడిచే వ్యక్తి ఒసామా బిన్ అని తెలిసింది. ఈ డ్రోన్ సాయంతో ఆ ఇంటిని లేజర్ స్కాన్ చేశారు. అచ్చం అలాంటి ఇంటినే అమెరికాలో కట్టారు. అలాంటి ఇంట్లో ఓ టెర్రరిస్ట్ ఉంటే ఎలా ఎటాక్ చేయాలో సీల్ టీమ్కు శిక్షణ ఇచ్చారు. ఆరు నెలల తర్వాత ఓ రాత్రి ఎటాక్ ప్లాన్ చేశారు. ఆ ఆపరేషన్కు జోరానిమో అని పేరు పెట్టారు. ఒబామా టీమ్ అమెరికాలోని వైట్ హౌస్లో కూర్చుని ఈ డ్రోన్, సీల్స్ బాడీ కెమెరాల ద్వారా అపరేషన్ను మానిటర్ చేస్తూ లాడెన్ను చంపేశార`ని పూరీ పేర్కొన్నారు.