దుర్గమ్మకు పుష్పార్చన

ABN , First Publish Date - 2021-04-18T06:21:52+05:30 IST

ఇంద్రకీలాద్రిపై జరుగుతోన్న వసంతోత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మకు వేదపండితులు, అర్చకులు పుష్పాలతో అర్చనలను కొనసాగిస్తున్నారు.

దుర్గమ్మకు పుష్పార్చన


ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న వసంత నవరాత్రోత్సవాలు 

విజయవాడ, ఏప్రిల్‌ 17, ఆంధ్రజ్యోతి : ఇంద్రకీలాద్రిపై జరుగుతోన్న వసంతోత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మకు వేదపండితులు, అర్చకులు పుష్పాలతో అర్చనలను కొనసాగిస్తున్నారు. ఐదోరోజు శనివారం తెల్లజిల్లేడు, మారేడు, తులసి, మరువం, దవనం పూలతో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పుష్పార్చన చేశారు.

Updated Date - 2021-04-18T06:21:52+05:30 IST