దుర్గమ్మకు పుష్పార్చన
ABN , First Publish Date - 2021-04-18T06:21:52+05:30 IST
ఇంద్రకీలాద్రిపై జరుగుతోన్న వసంతోత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మకు వేదపండితులు, అర్చకులు పుష్పాలతో అర్చనలను కొనసాగిస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న వసంత నవరాత్రోత్సవాలు
విజయవాడ, ఏప్రిల్ 17, ఆంధ్రజ్యోతి : ఇంద్రకీలాద్రిపై జరుగుతోన్న వసంతోత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మకు వేదపండితులు, అర్చకులు పుష్పాలతో అర్చనలను కొనసాగిస్తున్నారు. ఐదోరోజు శనివారం తెల్లజిల్లేడు, మారేడు, తులసి, మరువం, దవనం పూలతో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పుష్పార్చన చేశారు.