7న పుష్పశ్రీవాణి పాడేరు రాక: పీవో

ABN , First Publish Date - 2020-07-06T10:03:57+05:30 IST

రాష్ట్ర డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఈనెల ఏడో ..

7న పుష్పశ్రీవాణి పాడేరు రాక: పీవో

పాడేరు, జూలై 5: రాష్ట్ర డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఈనెల ఏడో తేదీన పాడేరు వస్తున్నారని ఐటీడీఏ పీవో ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు. తొలుత ఆమె ఏజెన్సీలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఐటీడీఏలో సమీక్షిస్తారు. అనంతరం అటవీ హక్కుల చట్టంలో భాగంగా, గిరిజనుల సాగుభూములకు హక్కులు కల్పించే వివరాలపై అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహిస్తారు.

Updated Date - 2020-07-06T10:03:57+05:30 IST