అజ్ఞాతంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు
ABN , First Publish Date - 2021-05-07T19:24:26+05:30 IST
కరీంనగర్: పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నాడని పుట్ట మధు సన్నిహితులు చెబుతున్నారు. పుట్ట మధు పోలీసుల అదుపులో ఉన్నాడని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్: పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నాడని పుట్ట మధు సన్నిహితులు చెబుతున్నారు. పుట్ట మధు పోలీసుల అదుపులో ఉన్నాడని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పుట్ట మధు వ్యవహారం ప్రగతి భవన్ వర్గాలకు తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు. పుట్ట మధు ఆచూకీ దొరక్క కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పుట్ట మధు భార్య శైలజ భేటీ అయ్యారు. ఈటలకు పార్టీ పరంగానే సన్నిహితుడని మధు అనుచరులు చెబుతున్నారు. రేపు పుట్ట మధు బయటకు వస్తాడని సమాచారం.