టీడీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన పుత్తా
ABN , First Publish Date - 2022-07-01T05:44:07+05:30 IST
ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన గోవిందుగారి రామకుమార్ కుటుంబాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి గురువారం రాత్రి పరామర్శించి ప్రఘాడ సానుభూతిని, సం తాపాన్ని తెలియజేశారు.
చెన్నూరు, జూన 30 : ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన గోవిందుగారి రామకుమార్ కుటుంబాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి గురువారం రాత్రి పరామర్శించి ప్రఘాడ సానుభూతిని, సం తాపాన్ని తెలియజేశారు. మండలంలోని కొండపేటకు చెందిన గోవిందుగారి సుబ్బరాయుడు ఎన్నో ఏళ్లుగా టీడీపీకి ఎంతో విధేయులుగా పని చేసేవారు. మండల కన్వీనర్ కె.విజయభాస్కర్రెడ్డి, రాష్ట్ర రైతువిభాగం కార్యదర్శి మల్లిఖార్జునరెడ్డి, టీడీపీ నేతలు ఆకుల చలపతి, ఆవుల పవనకుమార్రెడ్డి, వనం శ్రీరాములు, పాలగిరి సుదర్శనరెడ్డి, గౌస్పీర్, గందం ప్రసాద్, కుందేటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.