పీవీ తెలంగాణ వాడు కావడం మనకు గర్వకారణం

ABN , First Publish Date - 2021-12-23T20:41:00+05:30 IST

దివంగత మాజీ ప్రధాని పీవీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీ లోని అంబేద్కర్ హాలులో పలువురు తెలంగాణ నాయకులు పీవీకి ఘనంగా నివాళులర్పించారు.

పీవీ తెలంగాణ వాడు కావడం మనకు గర్వకారణం

న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని పీవీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీ లోని అంబేద్కర్ హాలులో పలువురు తెలంగాణ నాయకులు పీవీకి ఘనంగా నివాళులర్పించారు.రాష్ట్ర మంత్రులు, ఎంపీ లతో కలిసి పలువురునాయకులు పీవీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, ఎంపీ లు బండా ప్రకాశ్, సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ నేత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఒకే ఒక్క తెలుగు వాడు పీవీ అని,ఆయన తెలంగాణ వాడు కావడం మనకు గర్వకారణమని అన్నారు.పీవీ మేధావి, బహుభాషావేత్త,  అపార జ్ఞానం ఉన్నవాడని, రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు పొందారన్నారు.తన భూములను పేదలకు పంచి నాడు ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూ ధాత పీవీ అని కొనియాడారు. పీవీ వరంగల్ లోనే చదువుకున్నారని,జర్నలిస్టుగా తన జీవితాన్నిమొదలు పెట్టి, కాకతీయ పత్రిక నడిపి, బహు భాషలు నేర్చి, రాజకీయాల్లో చేరి, అనేక పదవులు అలంకరించారని గుర్తు చేశారు. 

Updated Date - 2021-12-23T20:41:00+05:30 IST